హైదరాబాద్హోమ్

పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

#Amberpet

అంబర్‌పేట మల్లికార్జున్ నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి భార్యాభర్తలు, వారి కూతురు శ్రావ్య ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. ఇటీవలే పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో కుటుంబం తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలే ఈ ఆత్మహత్యలకు కారణమై ఉంటాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. దేవుడు పిలుస్తున్నాడని, పెద్ద కూతురు దగ్గరికే వెళ్లాలని చుట్టుపక్కల వారికి చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

షేక్ హసీనా నేరస్థురాలే: న్యాయస్థానం వెల్లడి

Satyam News

డీలిమిటేషన్ తెలంగాణకు ఒక వరం?

Satyam News

బ్రేకింగ్ న్యూస్: లడ్డు కల్తీ వ్యవహారంలో కీలకపరిణామం

Satyam News

ఐఐఐటీ జంక్షన్ – డీఎల్‌ఎఫ్ కారిడార్ రహదారి అభివృద్ధి

Satyam News

పసికందును అమ్మిన తల్లి అరెస్టు

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News

Leave a Comment