హైదరాబాద్హోమ్

మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు

#MadhavaramKrishnarao

భర్తను కోల్పోయిన కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందచేసి కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. కూకట్ పల్లి గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన అంకెనపల్లి కుమార్ జులై నెల 28న వ్యక్తిగత సమస్యల వల్ల తన ఇంట్లో ఉరేసుకుని మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అతని ఇంటికి వెళ్ళి ల్ కుమార్ కూతురు అయినటువంటి 20 రోజుల పసిపాపనును చూసి చలించిపోయారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుమార్  కుటుంబానికి అండగా ఉంటానని అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మృతి చెందిన కుమార్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుమార్ తల్లి, భార్య మౌనిక, చైతన్య యాదవ్, సంతోష్ యాదవ్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

Related posts

పశ్చిమ బెంగాల్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు

Satyam News

ముంబైని ముంచేసిన భారీ వర్షం

Satyam News

రథసప్తమి రోజు చేయాల్సింది ఏమిటి?

Satyam News

గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి: టెక్ కంపెనీల ఆసక్తి

Satyam News

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News

వైభవంగా “బాపు బొమ్మ – విశ్వ మహిళ” అవార్డ్స్ ప్రదానోత్సవం

Satyam News

Leave a Comment