భర్తను కోల్పోయిన కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందచేసి కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. కూకట్ పల్లి గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన అంకెనపల్లి కుమార్ జులై నెల 28న వ్యక్తిగత సమస్యల వల్ల తన ఇంట్లో ఉరేసుకుని మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అతని ఇంటికి వెళ్ళి ల్ కుమార్ కూతురు అయినటువంటి 20 రోజుల పసిపాపనును చూసి చలించిపోయారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మృతి చెందిన కుమార్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుమార్ తల్లి, భార్య మౌనిక, చైతన్య యాదవ్, సంతోష్ యాదవ్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
