విశాఖపట్నంహోమ్

రైల్వే ట్రాక్ పై యువకుడు: ఎదురుగా రైలు…

#crime

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఒక యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాయకరావుపేట నాగరాజు పేట గేటు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యే శరణ్యమంటూ పడుకున్నాడు. అదే సమయంలో ట్రాక్‌పై ఒక రైలు వస్తుండటాన్ని గమనించిన అవుట్ పోస్ట్ రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది తక్షణమే సదరు రైలు లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించారు. మరోవైపు అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే స్పందించి, రైల్వే ట్రాక్‌పై పడుకున్న యువకుడిపైకి రాళ్లు విసిరి అలజడి సృష్టించారు. దాంతో భయపడిన ఆ యువకుడు పట్టాల పైనుంచి పక్కకు తప్పుకున్నాడు. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తి, స్థానికుల అప్రమత్తతతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

Related posts

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై భారత్‌లో ప్రకంపనలు!

Satyam News

భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం

Satyam News

సింగపూర్ తో ఏపీ భాగస్వామ్యం బలోపేతంపై చర్చ

Satyam News

ధాన్యం ఉత్పత్తిలో చైనాను అధిగమించిన భారత్

Satyam News

చంద్రబాబుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ భేటీ

Satyam News

ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు

Satyam News

Leave a Comment