26.3 C
Hyderabad
September 19, 2026
విశాఖపట్నంహోమ్

రైల్వే ట్రాక్ పై యువకుడు: ఎదురుగా రైలు…

#crime

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఒక యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాయకరావుపేట నాగరాజు పేట గేటు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యే శరణ్యమంటూ పడుకున్నాడు. అదే సమయంలో ట్రాక్‌పై ఒక రైలు వస్తుండటాన్ని గమనించిన అవుట్ పోస్ట్ రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది తక్షణమే సదరు రైలు లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించారు. మరోవైపు అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే స్పందించి, రైల్వే ట్రాక్‌పై పడుకున్న యువకుడిపైకి రాళ్లు విసిరి అలజడి సృష్టించారు. దాంతో భయపడిన ఆ యువకుడు పట్టాల పైనుంచి పక్కకు తప్పుకున్నాడు. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తి, స్థానికుల అప్రమత్తతతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

Related posts

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కు నివాళి

Satyam News

ప్రతి నియోజకవర్గంలో మహిళ దినోత్సవ వేడుకలు

Satyam News

రోజు రోజుకూ పెరుగుతున్న ‘తాగుడు’ ఆదాయం

Satyam News

సజ్జల నన్ను కొట్టాడు.. విజయసాయి బాధ!

Satyam News

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Satyam News

మత్తు మందు ఇచ్చి బాయ్ ఫ్రెండ్ అత్యాచారం

Satyam News

Leave a Comment