విశాఖపట్నంహోమ్

రైల్వే ట్రాక్ పై యువకుడు: ఎదురుగా రైలు…

#crime

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఒక యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాయకరావుపేట నాగరాజు పేట గేటు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యే శరణ్యమంటూ పడుకున్నాడు. అదే సమయంలో ట్రాక్‌పై ఒక రైలు వస్తుండటాన్ని గమనించిన అవుట్ పోస్ట్ రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది తక్షణమే సదరు రైలు లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించారు. మరోవైపు అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే స్పందించి, రైల్వే ట్రాక్‌పై పడుకున్న యువకుడిపైకి రాళ్లు విసిరి అలజడి సృష్టించారు. దాంతో భయపడిన ఆ యువకుడు పట్టాల పైనుంచి పక్కకు తప్పుకున్నాడు. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తి, స్థానికుల అప్రమత్తతతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

Related posts

కడపలో వైకాపాకు భారీ షాక్..

Satyam News

ఈనెల 23 నుండి శ్రీ శేషదాసుల 141 ఆరాధన ఉత్సవాలు

Satyam News

ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన

Satyam News

ముందు నేను మాట్లాడతా… వద్దు రాము, చివరి అవకాశం నీదే!

Satyam News

నెయ్యి ట్యాంకర్ బోల్తా: ప్రమాదమా? కుట్రా?

Satyam News

వనపర్తి మున్సిపల్ చైర్మన్ సీటులో పోటీ

Satyam News

Leave a Comment