ప్రపంచంహోమ్

జర్మనీలో కాల్పులు: ఐదు గురు మృతి

#crime

జర్మనీ ఉత్తర ప్రాంతంలోని స్టాడె పట్టణంలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ తెలిపింది. అయితే కాల్పులకు గల కారణాలు, మృతుల వివరాలు, నిందితుడి నేపథ్యం వంటి అంశాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ఘటన అనంతరం పట్టణ కేంద్రానికి వెలుపల ఉన్న ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు, దర్యాప్తు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

దాదాపు యాభై వేల జనాభా కలిగిన స్టాడె పట్టణం, హాంబర్గ్ నగరానికి పశ్చిమ దిశలో ఉంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Related posts

గల్ఫ్ దేశాల డేటా సెంటర్లను టార్గెట్ చేసిన ఇరాన్?

Satyam News

గండిపేట కు భారీ గా వరద నీరు

Satyam News

ప్రపంచ మహిళా హాకీ లో భారత్ శుభారంభం

Satyam News

అసెంబ్లీ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

Satyam News

అందరికీ ఆరాధ్యులు పొట్టి శ్రీరాములు

Satyam News

బా.సి.రెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

Satyam News

Leave a Comment