విజయనగరంహోమ్

రామతీర్థ పుణ్య క్షేత్రంలో ఘనంగా శివరాత్రి వేడుకలు

#Ramateerdham

ప్రసిధ్ధిగాంచిన రామతీర్ధంలో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. తెల్లవారు నుంచీ రామతీర్థ పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో శివోహం అంటూ మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు మాత్రం అంతగా అందుబాటులో లేదని భక్తులే పెదవి విరిచారు.

విషయం తెలుసుకున్న బందోబస్త్ కు ఇంచార్జ్ బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి ఎట్టకేలకు కంట్రోల్ రూమ్ ను భక్తుల అందుబాటులో కి తీసుకురావడంతో ఆనందం వ్యక్తం చేశారు. రామతీర్థంలోని శివాలయంలో ఆలయ అర్చకుని సమక్షంలో లింగోద్భవ కార్యక్రమం శాస్త్రోక్తంగా వేద పండితుల నడుము వైభవోపేతంగా కొనసాగింది. ఆలయం చుట్టూ దాదాపు 100 మంది పోలీస్ బందోబస్త్ గా గట్టి భద్రత ఏర్పాటు చేసారు.

సీసీఎస్  సీఐ కాంతారావు గర్భగుడి వద్ద, భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ ఆలయం లోపల బందోబస్త్ కు ఇంచార్జ్ లు గా వ్యవహరించారు. ఎస్ఐలు దుర్గా ప్రసాద్, భాస్కర్ రావుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్త్ జరిగింది.

#RamateerdhamPolice

Related posts

పహల్గామ్ ఉగ్రదాడి హఫీజ్ సయీద్‌ చేయించిందే…

Satyam News

ముందస్తు బెయిల్ కోసం ఖేరా యత్నం

Satyam News

4.14 కోట్లు పలికిన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్

Satyam News

చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాపై ఏం జరుగుతుంది?

Satyam News

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News

Film Update: అల్లూ అర్జున్ ‘రాకా’ పోస్టర్ విడుదల

Satyam News

Leave a Comment