ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. గతేడాది రంజాన్ మాసంలో ఓ పేద ముస్లిం మైనార్టీ సోదరుడికి ఇచ్చిన మాటను, ఏడాది తిరగకముందే నెరవేర్చి గొప్ప మనసు చాటుకున్నారు. నేను ఉన్నాను..నేను చూసుకుంటాను అంటూ నాడు లోకేష్ ఇచ్చిన హామీ, ఇవాళ ఒక అందమైన ఇల్లుగా మారి ఆ పేద కుటుంబంలో వెలుగులు నింపింది.
గతేడాది రంజాన్ సమయంలో ఒక పేద ముస్లిం మైనార్టీ సోదరుడి నివాసానికి వెళ్ళిన లోకేష్, అక్కడ వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను, వారి నివాస పరిస్థితిని చూసి లోకేష్ చలించారు. ఆ కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటానని, వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.
సాధారణంగా రాజకీయాల్లో హామీలు ఇచ్చి మరిచిపోవడం చూస్తుంటాం. కానీ లోకేష్ మాత్రం నిరంతరం ఆ ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ, ఏడాది తిరగకముందే ఆ పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేశారు. సకల సౌకర్యాలతో నిర్మించిన ఆ ఇంటిని చూసి ఆ ముస్లిం కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ పండుగ వేళ తమకు ఇంతటి గొప్ప బహుమతిని అందించిన మంత్రి లోకేష్కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మాట ఇస్తే వెనక్కి తగ్గని నైజం లోకేష్ది అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, కష్టాల్లో ఉన్న సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ముస్లిం మైనార్టీల పట్ల లోకేష్కు ఉన్న గౌరవం, ఆత్మీయతకు ఈ ఇల్లు ఒక నిదర్శనంగా నిలిచింది.
