ప్రత్యేకంహోమ్

మళ్ళీ విచారణ కు హాజరైన సునీల్ నాయక్

#SunilNayakIPS

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ నేడు గుంటూరులోని సీసీఎస్ (CCS) పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన దర్యాప్తు అధికారి ముందు విచారణకు వచ్చారు.

గతంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం సునీల్ నాయక్ ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వరుసగా విచారణకు హాజరయ్యారు. అయితే, మార్చి 12న జరిగిన విచారణకు ఆయన హాజరుకాలేదు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసేందుకు పట్నా వెళ్లాల్సి ఉందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు. ఆ విరామం అనంతరం కోర్టు సూచనల మేరకు నేడు తిరిగి విచారణ అధికారి ఎదుట హాజరయ్యారు.

మరోవైపు, సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అర్హత పిటిషన్‌పై కూడా నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. తాజా విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Related posts

ఫిలిప్పీన్స్ ను వణికించిన భారీ భూకంపం

Satyam News

అబద్ధాల పునాదులపై ఎంత కాలం ఇలా…?

Satyam News

డిసెంబర్ 1 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Satyam News

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

Satyam News

వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌-2026 లో దిగజారిన భారత్‌

Satyam News

జిందాల్ ఎంఎస్ఎమ్ఈ పార్క్ వర్చువల్ ప్రారంభోత్సవానికి సిద్ధం

Satyam News

Leave a Comment