ఆధ్యాత్మికంహోమ్

122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్‌’ గర్భ గుడి

ఒడిశాలోని 13వ శతాబ్దపు కోణార్క్‌ సూర్య దేవాలయ గర్భ గుడిలోకి త్వరలో భక్తులు ప్రవేశించే అవకాశం రానున్నది. ప్రస్తుతం ఆ స్థలం ఇసుకతో నిండి ఉంది. దాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. ఆలయం వెనుక ఉన్న 15 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోకుండా నిరోధించడానికి బ్రిటిష్‌ పాలకులు 1903-04లో గర్భ గుడిని వేల టన్నుల ఇసుకతో నింపారు.

జగ్‌మోహన్‌ హాల్‌గా పిలిచే ఈ ప్రాంతంలోకి శతాబ్దం పాటు ఎవరూ ప్రవేశించలేదు. తాజాగా భారత పురావస్తు శాఖ, ఐఐటీ మద్రాస్‌ నిపుణులతో కూడిన బృందం ఈ ఇసుకను తొలగించే పని చేపట్టింది. మొత్తం ఇసుకను తరలించడానికి మూడు నెలలు పడుతుందని ఓ పురావస్తు శాఖ అధికారి తెలిపారు. ఇసుకను తరలించిన తర్వాత లోపలి గోడల పటిష్ఠతను పరిశీలించి గుడి పునర్‌ నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Related posts

అమరావతి మీదుగా 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు

Satyam News

అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు

Satyam News

హోర్ముజ్ జలసంధి లో ట్యాంకర్ల కు రక్షణ కల్పించలేదు

Satyam News

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌

Satyam News

రోజా కు బిగుసుకుంటున్న అవినీతి ఉచ్చు

Satyam News

అహా ఓటీటీలో దుమ్ము రేపుతున్న తురుమ్ ఖాన్

Satyam News

Leave a Comment