ప్రజలకు పౌర సేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వంనిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం పల్నాడు జిల్లాకు రెండవ స్థానం లభించిందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు.
ముఖ్యంగా అన్నక్యాంటీన్ల నిర్వహణ, ఆర్టీసీ బస్సు ప్రయాణ వసతి, రైతులకు విత్తనాల పంపిణీ, వైద్య సేవలు, మహిళలపై నేరాల నివారణ తదితర 39 రకాల సేవలపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా రెండవ స్థానం సాధించింది.
డిసెంబరు నెలతో పోలిస్తే 68.1 శాతం ఉన్న ప్రజల సంతృప్త స్థాయి 5.4 శాతం వృద్ధి సాధించి 73.50 శాతానికి పెరిగిందన్నారు.
