జాతీయంహోమ్

బెంగాల్, తమిళనాడులో పోలింగ్ ప్రారంభం

#Tamilnadu

బెంగాల్ లోని తొలి విడత స్థానాలు 152, తమిళనాడులోని మొత్తం స్థానాలకు 234 గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు.

మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. బెంగాల్​లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు జరుగుతుండగా, తమిళనాడులో ముక్కోణ పోటీ నెలకొంది. ఇక్కడ డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య పోటీ జరుగుతోంది.

తమిళనాడులో వేర్వేరు చోట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యలు చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్‌ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య విజయ్‌ను అక్కడి నుంచి తరలించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్, చెన్నైలోని తిరువాన్మియూర్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

Related posts

ఈ స్వరాభిషేకం సినిమా కథ కాదు

Satyam News

పొగాకు రైతులకు డబుల్ ధమాకా…. కూటమి ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌

Satyam News

విశాఖ కు వచ్చేసిన ట్రాఫిక్ గన్స్

Satyam News

సామాన్యుడి కోసం ఏఐ… అదే మన సూత్రం

Satyam News

మిడ్జిల్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Satyam News

మంగుళూరు రేవు కు చేరిన వంట గ్యాస్ షిప్

Satyam News

Leave a Comment