జాతీయంహోమ్

బెంగాల్, తమిళనాడులో పోలింగ్ ప్రారంభం

#Tamilnadu

బెంగాల్ లోని తొలి విడత స్థానాలు 152, తమిళనాడులోని మొత్తం స్థానాలకు 234 గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు.

మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. బెంగాల్​లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు జరుగుతుండగా, తమిళనాడులో ముక్కోణ పోటీ నెలకొంది. ఇక్కడ డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య పోటీ జరుగుతోంది.

తమిళనాడులో వేర్వేరు చోట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యలు చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్‌ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య విజయ్‌ను అక్కడి నుంచి తరలించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్, చెన్నైలోని తిరువాన్మియూర్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

Related posts

రోడ్డెక్కిన దస్తావేజుల లేఖరులు

Satyam News

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

Satyam News

ఎసిబి వలలో వనపర్తి జిల్లా సివిల్ సప్లయి డి.ఎం

Satyam News

సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా

Satyam News

దేవాలయాల్లో భక్తుల్ని హతమార్చే భారీ కుట్ర

Satyam News

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక త్యాగంతోనే రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం

Satyam News

Leave a Comment