జాతీయంహోమ్

బెంగాల్, తమిళనాడులో పోలింగ్ ప్రారంభం

#Tamilnadu

బెంగాల్ లోని తొలి విడత స్థానాలు 152, తమిళనాడులోని మొత్తం స్థానాలకు 234 గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు.

మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. బెంగాల్​లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు జరుగుతుండగా, తమిళనాడులో ముక్కోణ పోటీ నెలకొంది. ఇక్కడ డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య పోటీ జరుగుతోంది.

తమిళనాడులో వేర్వేరు చోట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యలు చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్‌ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు మధ్య విజయ్‌ను అక్కడి నుంచి తరలించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్, చెన్నైలోని తిరువాన్మియూర్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

Related posts

శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

Satyam News

కేసీఆర్ పూజ గదిలో ఏముందో తెలిస్తే……

Satyam News

లెబనాన్ పై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్

Satyam News

నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

Satyam News

జోగి రమేష్ ఇంటికి నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు

Satyam News

విదేశీ నిధులు తెచ్చుకునే సంస్థలకు ఝలక్

Satyam News

Leave a Comment