26.3 C
Hyderabad
September 19, 2026
తూర్పుగోదావరి

రాయవరం లో అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణా

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రంలో పేదలకు అందాల్సిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) రేషన్ బియ్యం అక్రమంగా తరలింపుకు గురవుతున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రేషన్ పొందిన పలువురు లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి తన ఇంటిలో నిల్వ ఉంచినట్లు సమాచారం.

ఈ నిల్వలను శనివారం అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు అధికారులకు సమాచారం అందించినప్పటికీ, అధికారులు స్పందించేలోపే అక్రమార్కులు బియ్యాన్ని తరలించడంతో వారు తప్పించుకున్నారు.

ఇంత బహిరంగంగా, నడిరోడ్డుపై పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా తరలింపుకు గురవుతుండగా, రెవెన్యూ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సమాచారం ఇచ్చినా చర్యలు ఆలస్యమైతే ఇలాంటి దందాలు ఎలా ఆగుతాయి?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నా… పేదవాడి గుప్పెడు బియ్యం మాత్రం అక్రమార్కుల జేబులు నింపడానికి ఉపయోగపడుతుండటం దురదృష్టకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి అక్రమాలను అరికట్టకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత విషమించనుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Related posts

రేపు పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన

Satyam News

చీటీల పేరుతో ఘరానా మోసం…!

Satyam News

జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ దృష్టి

Satyam News

వేట్లపాలెం బాధితులకు మంద కృష్ణ మాదిగ పరామర్శ

Satyam News

తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు

Satyam News

వైకాపాకు షాక్ – సర్దుకొంటున్న సీనియర్లు!

Satyam News

Leave a Comment