తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు. విద్యార్థి ఫిర్యాదును పోలీసులు వెంటనే స్వీకరించారని, ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పూర్తి స్థాయి విచారణ కోసం ఒడిశాకు కూడా ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపినట్లు తెలిపారు. బాధిత విద్యార్థికి న్యాయం చేయడం తమ కర్తవ్యమని, ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. మహిళల భద్రత తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
previous post
