ఆధ్యాత్మికంహోమ్

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

#Tirumala

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఫిబ్ర‌‌వ‌రి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 2న మాఘపౌర్ణమి సందర్భంగా కూపుచంద్రపేట ఉత్సవం.

7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంట‌లకు ఊంజ‌ల సేవ‌, సాయంత్రం 5.30 గంట‌ల‌కు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

17వ తేదీ అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

ఫిబ్ర‌వ‌రి 28న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

Related posts

చీఫ్ సెక్రటరీకి మానవ హక్కుల సంఘం నోటీసు

Satyam News

బాణాసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు

Satyam News

మధ్యాహ్న భోజనంలో అవినీతి మరకలు

Satyam News

జగన్‌.. నీ జే బ్రాండ్స్‌ మర్చిపోయావా..లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్‌

Satyam News

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

Satyam News

దానాలకు శ్రేష్ఠం సంక్రాంతి పండుగ రోజు

Satyam News

Leave a Comment