అనంతపురంహోమ్

వైసీపీ నేత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు

సత్యసాయి జిల్లా కు చెందిన వైసీపీ నాయుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కవాడి నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి ఉదయం చిలామతురు మండలం లోని అటవీ ప్రాంతం లో అరెస్ట్ చేయడానికి వెళ్లిన కానిస్టేబుళ్ల పై నాగేంద్ర దాడి చేశాడు.

పోలీసులపైనే దాడికి దిగిన నాగేంద్ర ను కాల్పులు జరిపి పోలీసులు అరెస్ట్ చేశారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తా, కోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర నిందితుడు. 40 కేసుల్లో నాగేంద్ర నిందితుడిగా ఉన్నాడు. అయితే చాలా కాలంగా నాగేంద్ర తప్పించుకుని తిరుగుతున్నాడు.

నాగేంద్ర దాడి లో రవి అనే కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకుని అదనపు సిబ్బంది తో కలిసి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం సిఐ ఆంజనేయులు చేశారు. కాళ్ల పై కాల్పులు జరిపి నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసు ట్రయిల్ లో ఉన్నప్పటి నుంచి నాగేంద్ర పరారీ లో ఉన్నాడు. నాగేంద్రపై ఆంధ్రా, కర్ణాటకల్లో పలు ప్రాంతాల్లో 70 కేసులు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో నే 40 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Related posts

నిలిచిన బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కలమట

Satyam News

చీఫ్ సెక్రటరీకి మానవ హక్కుల సంఘం నోటీసు

Satyam News

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక త్యాగంతోనే రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం

Satyam News

గద్వాల చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Satyam News

మంగళగిరిని మంత్రి లోకేష్‌ ఏం చేయబోతున్నారు?

Satyam News

కుక్కను కొట్టినందుకు పెళ్లి క్యాన్సిల్

Satyam News

Leave a Comment