25.2 C
Hyderabad
September 20, 2026
అనంతపురంహోమ్

వైసీపీ నేత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు

సత్యసాయి జిల్లా కు చెందిన వైసీపీ నాయుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కవాడి నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి ఉదయం చిలామతురు మండలం లోని అటవీ ప్రాంతం లో అరెస్ట్ చేయడానికి వెళ్లిన కానిస్టేబుళ్ల పై నాగేంద్ర దాడి చేశాడు.

పోలీసులపైనే దాడికి దిగిన నాగేంద్ర ను కాల్పులు జరిపి పోలీసులు అరెస్ట్ చేశారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తా, కోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర నిందితుడు. 40 కేసుల్లో నాగేంద్ర నిందితుడిగా ఉన్నాడు. అయితే చాలా కాలంగా నాగేంద్ర తప్పించుకుని తిరుగుతున్నాడు.

నాగేంద్ర దాడి లో రవి అనే కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకుని అదనపు సిబ్బంది తో కలిసి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం సిఐ ఆంజనేయులు చేశారు. కాళ్ల పై కాల్పులు జరిపి నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసు ట్రయిల్ లో ఉన్నప్పటి నుంచి నాగేంద్ర పరారీ లో ఉన్నాడు. నాగేంద్రపై ఆంధ్రా, కర్ణాటకల్లో పలు ప్రాంతాల్లో 70 కేసులు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో నే 40 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Related posts

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

Satyam News

దళిత మహిళ పై దాడిచేసిన అగ్రకులస్తుడు

Satyam News

నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి

Satyam News

U Turn: మళ్లీ మాట మార్చిన అమెరికా అధ్యక్షుడు

Satyam News

అల్లుడు తో రాసలీలలు సాగిస్తూ….

Satyam News

పెట్రేగి పోతున్న అక్రమ మట్టి మాఫియా

Satyam News

Leave a Comment