ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ మోహన్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిదితుడైన షేక్ తమిమ్ బెంగళూరు లో పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వెంకటగిరి కోట (వి.కోట ) లో మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న ఆంధ్రజ్యోతి రిపోర్టార్ జగన్మోహన్ రెడ్డి ని కత్తులతో దాడి చేసి షేక్ తమిమ్, సయ్యద్ సుభాన్ హత్య చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక జర్నలిస్ట్ రోడ్ పైకి వచ్చి మా జర్నలిస్ట్ ను హత్య చేసిన ఉగ్రవాది, ఎర్రచందనం స్మగ్లర్ల ను వెంటనే ఎంకౌంటర్ చేయాలని రోడ్ పైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకో లు చేసి, ప్రభుత్వ అధికారులకు పిర్యాదు చేసి విన్నవించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లా ఏస్పీ ఆధ్వర్యంలో ఈ ఉగ్రవాదులను పట్టుకోవడానికి కోసం అయిదు పోలీస్ బృందాలు ఏర్పాటు చేసింది.
దాంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఎక్కడ ఎంకౌంటర్ చేస్తారో అని భయం పుట్టి, నిన్నటి దినం బుధవారం రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు లొంగిపోయారని సమాచారం.
