మహబూబ్ నగర్హోమ్

ప్రజాకవి కాళోజీ యాదిలో ‘తెలంగాణ భాషా దినోత్సవం’

#KalijiNarayanarao

​ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని పెద్దదొడ్డి ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య , ఉపాధ్యాయులు చక్రధర్, నాగరాజు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ భాష, యాసకు కాళోజీ తెచ్చిన గుర్తింపును, ఆయన రాసిన రచనలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. “పుటక నీది, చావు నీది, బతుకంతా దేశానిది” అంటూ కాళోజీ సమాజానికి అందించిన సందేశాన్ని గుర్తుచేశారు. మాతృభాష ప్రాముఖ్యతను కాపాడుకోవాలని, తెలంగాణ భాషా సౌందర్యాన్ని భావితరాలకు అందించాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ సర్కార్  మరో భారీ భూ కుంభకోణం

Satyam News

అమ్మా…. నాకు ఆ అబ్బాయి కావాలి!

Satyam News

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

Satyam News

ధర్మం మంటగలిస్తే… ఆ త్రికూటేశ్వరుడు కన్నెర్ర చేయడా?

Satyam News

శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తీసుకుంటున్న ఆంధ్ర

Satyam News

మధిర లో ఘనంగా దసరా  ఉత్సవాలు

Satyam News

Leave a Comment