ముఖ్యంశాలుహోమ్

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం: 41 మంది మృతి?

#Indonesia

ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఘోర నౌక ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు ప్రాణభయంతో సముద్రంలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యల్లో పలువురిని సురక్షితంగా రక్షించినప్పటికీ, ఇంకా 41 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం నౌకాదళం, కోస్ట్ గార్డ్, స్థానిక రక్షణ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

వీరంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన ఇండోనేషియా అధికారులు, నౌకలో మంటలు ఎలా చెలరేగాయనే అంశంపై విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Related posts

కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట

Satyam News

AI గేట్‌ వే ఆఫ్‌ ఆసియాగా విశాఖ

Satyam News

చంద్రబాబుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ భేటీ

Satyam News

Satyam News

ఉమ్మడి ఖమ్మం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయం

Satyam News

శ్రీనగర్ – లడఖ్ మధ్య రవాణా కష్టాలకు చెక్

Satyam News

Leave a Comment