27.1 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రం

గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికన్ పెట్టుబడులు ఉన్న చమురు కంపెనీలే లక్ష్యంగా ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడులు ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే ఇరాన్ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది.

గల్ఫ్ దేశాల్లోని పోర్టులు, చమురు కర్మాగారాలు, అమెరికన్ మిలిటరీ బేస్‌లు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఇరాన్ సూచించింది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని దుబాయ్‌లో ఉన్న కీలకమైన జేబల్ ఆలీ పోర్ట్, అబుదాబీలోని ఖలీఫా పోర్ట్, మరియు ఫుజయిరా పోర్టులను తాము లక్ష్యంగా చేసుకోబోతున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది.

తన దేశానికి అత్యంత కీలకమైన ఆయిల్ నిక్షేప కేంద్రమైన ‘ఖర్గ్ ద్వీపం’పై ఎమిరేట్స్ భూభాగం నుంచే దాడి జరిగిందని ఇరాన్ తీవ్రంగా ఆరోపించింది. ఈ దాడిని ఏమాత్రం ఉపేక్షించబోమని, తమ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసినందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

ఎమిరేట్స్ సర్వనాశనానికి సిద్ధం కావాలని హెచ్చరిస్తూ ఇరాన్ తన క్షిపణి దాడులను ముమ్మరం చేయడంతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను మరియు గల్ఫ్ ప్రాంత భద్రతను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.

 

Related posts

పోలవరం లో డీ వాటరింగ్ ప్రారంభం

Satyam News

జెఫ్రీ ఎప్ స్టిన్ మాజీ ప్రేయసికి రూ.850 కోట్లకు పైగా ఆస్తి?

Satyam News

చంద్రబాబుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ భేటీ

Satyam News

తెలుగు ఇండస్ట్రీకి మరో యువ హీరో దొరికాడు

Satyam News

భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి

Satyam News

భారత్ లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువ జంట

Satyam News

Leave a Comment