ప్రత్యేకంహోమ్

గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రం

గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికన్ పెట్టుబడులు ఉన్న చమురు కంపెనీలే లక్ష్యంగా ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడులు ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే ఇరాన్ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది.

గల్ఫ్ దేశాల్లోని పోర్టులు, చమురు కర్మాగారాలు, అమెరికన్ మిలిటరీ బేస్‌లు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఇరాన్ సూచించింది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని దుబాయ్‌లో ఉన్న కీలకమైన జేబల్ ఆలీ పోర్ట్, అబుదాబీలోని ఖలీఫా పోర్ట్, మరియు ఫుజయిరా పోర్టులను తాము లక్ష్యంగా చేసుకోబోతున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది.

తన దేశానికి అత్యంత కీలకమైన ఆయిల్ నిక్షేప కేంద్రమైన ‘ఖర్గ్ ద్వీపం’పై ఎమిరేట్స్ భూభాగం నుంచే దాడి జరిగిందని ఇరాన్ తీవ్రంగా ఆరోపించింది. ఈ దాడిని ఏమాత్రం ఉపేక్షించబోమని, తమ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసినందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

ఎమిరేట్స్ సర్వనాశనానికి సిద్ధం కావాలని హెచ్చరిస్తూ ఇరాన్ తన క్షిపణి దాడులను ముమ్మరం చేయడంతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను మరియు గల్ఫ్ ప్రాంత భద్రతను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.

 

Related posts

మన బడి పిలుస్తోంది..మనబడి గెలుస్తోంది

Satyam News

రైల్వే ట్రాక్ పై యువకుడు: ఎదురుగా రైలు…

Satyam News

యుద్ధం నేపథ్యంలో TGWWC ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం

Satyam News

‘ఉద్దానం’లో తొలిసారిగా బయోమార్కర్స్ పరీక్షలు

Satyam News

హోర్ముజ్ జలసంధి లో ట్యాంకర్ల కు రక్షణ కల్పించలేదు

Satyam News

గృహ ప్రవేశం లో గుండె పోటు… సో.. శాడ్

Satyam News

Leave a Comment