26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

రెండు పెట్రోల్ బ్యాంకులను సీజ్ చేసిన కలెక్టర్

పల్నాడు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇంధన విక్రయాలు జరుపుతున్న రెండు పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేట పట్టణంలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్ మరియు పిడుగురాళ్లలోని తిరుమల ఫిల్లింగ్ స్టేషన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన అధికారులు, కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణమే వాటిని మూసివేశారు.

జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పెట్రోల్ బంకుల వద్ద రద్దీని అదుపు చేయడానికి మరియు అక్రమ అమ్మకాలను అరికట్టడానికి కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు.

సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఇంధన సరఫరాలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించిన ఆమె, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలతో జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చింది.

Related posts

నిర్మాణ రంగా అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి

Satyam News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కూన శ్రీనివాస్ గౌడ్

Satyam News

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

Satyam News

ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించిన కేంద్ర మంత్రి

Satyam News

మతం మారిన వారి ఎస్సీ రిజర్వేషన్ రద్దు

Satyam News

డయాబెటిస్ కు చికిత్స కనిపెట్టిన చైనా

Satyam News

Leave a Comment