26.3 C
Hyderabad
September 19, 2026
రంగారెడ్డిహోమ్

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కూన శ్రీనివాస్ గౌడ్

#KunaSrisailamGoud

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కొండా సుజాత, ఎరగాంధండ్ల వంశీ, రెడ్డి సత్యనారాయణ, నీరుడు ఓంప్రకాష్, మర్గం శంకర్, కొట్టె సులోచన గతంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిఎం సహాయనిధి కింద దరఖాస్తు చేసుకున్నారు.

వారికి ఈరోజు తన నివాసం వద్ద మూడు లక్షల రూపాయల సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అలాగే మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో  ప్రజాపాలన ద్వారా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తుంన్నారని కొనియాడారు.

Related posts

ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్ ధ‌ర‌లు త‌గ్గించాలి

Satyam News

ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం శత శాతం పూర్తి

Satyam News

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆగస్టు 2న

Satyam News

టెలికాం సేవల కోసం TRAI కొత్త యాప్ ఇదే…

Satyam News

లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్… గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా ఏపీ

Satyam News

బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు

Satyam News

Leave a Comment