కర్నూలుహోమ్

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

#ChandrababuNaidu

కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెంపో వాహనం-లారీ ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఎం ఆరా తీశారు.

కర్ణాటకకు చెందిన భక్తుల వాహనం మంత్రాలయం దర్శనానికి వస్తుండగా తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగిందని, ఘటనా స్థలంలోనే 8 మంది మృతి చెందారని వివరించారు. గాయపడిన 10 మందికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related posts

బద్దలవుతున్న జగన్‌ పీఏ అవినీతి కొండ….!!

Satyam News

నేషనల్ ఛాంపియన్ షిప్ కు తెలంగాణ వాటర్ పోలో జట్టు

Satyam News

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోండి

Satyam News

టీఆర్ఎస్ ఇక కల్వకుంట్ల కవితదే….

Satyam News

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆధునిక టెక్నాలజీ

Satyam News

యూట్యూబర్ నాన్సీ హత్యకు అసలు కారణం ఏమిటి?

Satyam News

Leave a Comment