జాతీయం

ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసు: ఇక సీరియస్

#DelhiPolice

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో పోస్ట్ చేసిన ప్రచురితమైన “అవమానకర, దురుద్దేశపూర్వక, పరువునష్టం కలిగించే” కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ పోలీసులు ఎక్స్‌కు అధికారికంగా లేఖ రాశారు. ఈ అంశంపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తమ లేఖలో సంబంధిత పోస్టు లేదా వీడియోను తక్షణమే తొలగించాలని ఎక్స్‌ను కోరారు. అలాగే ఆ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన ఎక్స్ ఖాతాదారుడి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. ఇందులో ఖాతాదారుడి పూర్తి పేరు, చిరునామా, సంప్రదింపు వివరాలు, ఈ-మెయిల్ ఐడీతో పాటు ఇతర నమోదిత సమాచారం కూడా ఇవ్వాలని కోరారు.

అంతేకాకుండా, ఆ ఖాతాకు సంబంధించిన లాగిన్, లాగ్‌అవుట్ రికార్డులు తేదీ, సమయ వివరాలతో సహా అందించాలని, దర్యాప్తుకు ఉపయోగపడే ఇతర సాంకేతిక సమాచారాన్ని కూడా సమర్పించాలని పోలీసుల లేఖలో పేర్కొన్నారు.

భవిష్యత్ దర్యాప్తు కోసం సంబంధిత పోస్టు లేదా వీడియోకు సంబంధించిన అన్ని డిజిటల్ రికార్డులను భద్రపరచాలని కూడా ఎక్స్‌ను ఆదేశించారు. భారతీయ సాక్ష్యాధార చట్టం (Bharatiya Sakshya Adhiniyam – BSA) సెక్షన్ 63(4) ప్రకారం అవసరమైన సర్టిఫికెట్‌ను సమర్పించాలని కోరారు.

ఇటీవల జరిగిన నిరసనల సమయంలో, అనంతరం సోషల్ మీడియాలో ప్రచురితమైన పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలను పోలీసులు సమీక్షిస్తున్నారు. చట్ట ఉల్లంఘనలు జరిగాయా? ప్రజా శాంతిభద్రతలపై వాటి ప్రభావం ఏమిటి? అనే అంశాలపై అన్ని సోషల్ మీడియా వేదికలలో పరిశీలన కొనసాగుతోంది.

ఇదివరకు కూడా ఢిల్లీ పోలీసులు, పాకిస్తాన్‌కు అనుబంధంగా ఉన్నట్లు అనుమానిస్తున్న 400కు పైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఖాతాల ద్వారా నిరసనలకు సంబంధించిన తప్పుడు కథనాలు, వదంతులు, డీప్‌ఫేక్ వీడియోలు విస్తృతంగా ప్రచారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Related posts

కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్

Satyam News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం తోనే సమగ్ర క్రీడాభివృద్ధి

Satyam News

అమెరికా నౌకాదళంలో భారతీయ బాలిక

Satyam News

ఉత్తరకాశీ జలఉత్పాతానికి కారణం ఏమిటి?

Satyam News

డిజిటల్ మోసం: రూ.58 కోట్లు హాంఫట్

Satyam News

అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ కేసు

Satyam News

Leave a Comment