క్రీడలుహోమ్

బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులుగా సానా సతీష్

#SanaSatish

నేడు జరిగిన బీసీసీఐ 94వ వార్షిక సాధారణ సమావేశం (AGM) లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా క్రికెట్ మౌలిక వసతుల రూపకల్పన, అభివృద్ధి, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. స్టేడియంల నిర్మాణం, ఆధునికీకరణ, శిక్షణా కేంద్రాల ఏర్పాటు, పిచ్‌లు మరియు మైదానాల నాణ్యత, నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల పర్యవేక్షణ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల సాధన వంటి బాధ్యతలు ఈ కమిటీ పరిధిలోకి వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ నుండి ఇలాంటి ప్రతిష్టాత్మక కమిటీలో సభ్యునిగా ఎన్నిక కావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణంగా మారింది. అభిమానులు, క్రీడాభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నియామకం వల్ల రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కొత్త స్టేడియంల నిర్మాణం, ఉన్న మైదానాల ఆధునికీకరణ, శిక్షణా సదుపాయాల ఏర్పాటు, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్యమివ్వగల వేదికల అభివృద్ధి వంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్‌లో మరింతగా పెరగనున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, యువనేత  నారా లోకేష్ ప్రోత్సాహంతో పాటు, ప్రధానమంత్రి, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వేగంగా పురోగతి సాధిస్తోంది. ఈ సందర్భంలో సతీష్ బాబు బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీలో  సభ్యత్వం పొందడం రాష్ట్ర ప్రతిష్ఠను పెంచడమే కాకుండా, క్రీడా రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలను తెరుస్తుందని విశ్వసించవచ్చు.

Related posts

ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్ హెచ్చరిక

Satyam News

గంజాయి పై ఉక్కు పాదం: ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

Satyam News

శ్రీకాకుళంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Satyam News

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి:రాచాల

Satyam News

ప‌రకామ‌ణి చోరీ కేసులో కీలక వ్యక్తి హత్య?

Satyam News

డిఎస్సీ 2025 పై సృతి మించిన వైసీపీ ఫేక్ ప్రచారం

Satyam News

Leave a Comment