గుంటూరుహోమ్

స్వీయ జనగణన ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు

#ChadalavadaAravindBabuMLA

ప్రతి ఒక్కరు స్వీయ జనగణనలో పాల్గొనాలని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు రోడ్‌లోని టీడీపీ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తన మొబైల్ ఫోన్‌లో స్వయంగా జనగణన వివరాలు నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ జనగణనలో పాల్గొనాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, విద్యావంతులు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా సులభంగా వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది ఖచ్చితమైన డేటా సేకరణకు ఉపయోగపడుతుందని వివరించారు.

Related posts

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ‘రీ-ఎంట్రీ’ సదుపాయం

Satyam News

ఈనాడు రామారావు మాస్టారు ఇక లేరు

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మెలిక వెనక…. అసలు కారణం ఇదే!

Satyam News

మమతా బెనర్జీని దెబ్బతీసిన అహంకారం

Satyam News

వైసీపీ సింపతీ ఫార్ములాకు ఎక్స్‌పైరీ డేట్.. జనాల్లో రివర్స్ ఎఫెక్ట్‌!

Satyam News

Leave a Comment