ప్రతి ఒక్కరు స్వీయ జనగణనలో పాల్గొనాలని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తన మొబైల్ ఫోన్లో స్వయంగా జనగణన వివరాలు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ జనగణనలో పాల్గొనాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, విద్యావంతులు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల ద్వారా సులభంగా వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది ఖచ్చితమైన డేటా సేకరణకు ఉపయోగపడుతుందని వివరించారు.
