గుంటూరుహోమ్

స్వీయ జనగణన ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు

#ChadalavadaAravindBabuMLA

ప్రతి ఒక్కరు స్వీయ జనగణనలో పాల్గొనాలని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు రోడ్‌లోని టీడీపీ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తన మొబైల్ ఫోన్‌లో స్వయంగా జనగణన వివరాలు నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ జనగణనలో పాల్గొనాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, విద్యావంతులు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా సులభంగా వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది ఖచ్చితమైన డేటా సేకరణకు ఉపయోగపడుతుందని వివరించారు.

Related posts

జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి

Satyam News

దేశ భద్రతలో పుట్టపర్తి ఏరోస్పేస్ క్లస్టర్ ప్రాముఖ్యత ఏమిటి?

Satyam News

నిర్మాతగా నా స్థాయిని పెంచే చిత్రం “మఫ్టీ పోలీస్”

Satyam News

వీఎస్‌యూలో ముగిసిన ‘ఆంగ్ల బోధన’ జాతీయ సదస్సు

Satyam News

హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

విజయవాడ లో ఉగ్రవాదుల అరెస్టు

Satyam News

Leave a Comment