మహబూబ్ నగర్హోమ్

దీపావళి ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

జిల్లా ప్రజల జీవితాల్లో దీపావళి పండగ కోటికాంతులు నింపాలని నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్​ సంతోష్​ అన్నారు. దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్​ సంతోష్​ మాట్లాడుతూ… చీకటి నుంచి వెలుగులోకి… చెడుపైన మంచి… దుష్టశక్తులపైన దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండగను ఆనందోత్సాహాలతో కుటుంబసభ్యుల మధ్య జరుపుకోవాలని కోరారు.

పండగ సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండగను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. నాగర్​ కర్నూల్​ జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలిగి ప్రతి ఇంటా కోటి ఆనంద దీపాలు వెలగాలని కలెక్టర్ బాదావత్​ సంతోష్​ ఆకాంక్షించారు.

Related posts

డ్రగ్స్ రహిత తెలంగాణ సాధిద్దాం

Satyam News

నిలిచిన బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కలమట

Satyam News

గాదె ఇన్నయ్య అరెస్టు అన్యాయం

Satyam News

డిజిటల్ ఆధారాల విశ్లేషణలో పోలీస్ అకాడమీలో ఆధునిక శిక్షణ

Satyam News

అర్జున్‌ అంబటి ‘పరమపద సోపానం’

Satyam News

టీ 20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్

Satyam News

Leave a Comment