మహబూబ్ నగర్ హోమ్

దీపావళి ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

జిల్లా ప్రజల జీవితాల్లో దీపావళి పండగ కోటికాంతులు నింపాలని నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్​ సంతోష్​ అన్నారు. దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్​ సంతోష్​ మాట్లాడుతూ… చీకటి నుంచి వెలుగులోకి… చెడుపైన మంచి… దుష్టశక్తులపైన దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండగను ఆనందోత్సాహాలతో కుటుంబసభ్యుల మధ్య జరుపుకోవాలని కోరారు.

పండగ సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండగను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. నాగర్​ కర్నూల్​ జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలిగి ప్రతి ఇంటా కోటి ఆనంద దీపాలు వెలగాలని కలెక్టర్ బాదావత్​ సంతోష్​ ఆకాంక్షించారు.

Related posts

కృష్ణా ,గోదావరి నదుల్లో భారీ వరద

Satyam News

పోర్టుల అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు!

Satyam News

విజయవాడ దుర్గగుడి ఆలయ కమిటీ కొత్త సభ్యుల నియామకం

Satyam News

Leave a Comment

error: Content is protected !!