జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం గంట వీధి నందు వెలిసిన అతి పురాతనమైన దేవాలయం శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కాబట్టి శ్రీ గోపాలకృష్ణ మందిరం నందు హిందూ బంధువుల సామూహిక వనభోజనాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ తరఫున ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో వచ్చి గోపాలకృష్ణుని పూజించి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీధి ప్రజలు కార్తీక వనభోజనం ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
next post
Satyam News
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
