25.2 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

సినీ జంట కు డీఎన్ఏ పరీక్ష

తమిళ సినీ, టెలివిజన్ రంగ ప్రముఖ నటుడు, మదంపట్టి రంగరాజ్‌కు సంబంధించిన వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రంగరాజ్‌పై దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు, ఆయనకు డీఎన్‌ఏ (DNA) పరీక్షలు నిర్వహించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.

సినీ పరిశ్రమలో వెడ్డింగ్ డిజైనర్‌గా సుపరిచితురాలైన క్రిజిల్డా అనే మహిళ వేసిన కేసుకు సంబంధించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న రంగరాజ్, తనతో ప్రేమాయణం సాగించి గర్భవతిని చేశాడని, తమకు ఒక బిడ్డ కూడా పుట్టాడని క్రిజిల్డా తన పిటిషన్‌లో పేర్కొంది.

అయితే, ఆమె ఆరోపణలను రంగరాజ్ తీవ్రంగా ఖండించారు. సదరు బిడ్డకు తనకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం డబ్బు కోసమే ఆమె తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆయన కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్షే మార్గమని భావించి, అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ పరీక్షా ఫలితాలు వెలువడితేనే ఈ వివాదానికి ఒక స్పష్టమైన ముగింపు వచ్చే అవకాశం ఉంది.

Related posts

కడపలో అర్ధరాత్రి దారుణం: ఇల్లు నేలమట్టం

Satyam News

తీసేసిన ఓటర్ల పేర్లు ప్రకటించిన ఎన్నికల సంఘం

Satyam News

సిరిసిల్ల వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలించిన కేటీఆర్

Satyam News

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ “అమ్ములు”కు అనూహ్య స్పందన

Satyam News

జగన్‌ పాలనలో ప్రభుత్వ స్కూల్స్‌ నుండి10 లక్షల మంది విద్యార్ధులు ఔట్‌

Satyam News

రబీ రైతు భరోసా కోసం రాహుల్ గాంధీ కి వినతి

Satyam News

Leave a Comment