26.7 C
Hyderabad
September 20, 2026
జాతీయంహోమ్

గుట్టలు గుట్టలుగా రద్దయిన నోట్లు

#Cash

ఉత్తర ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్రమ నగదు రవాణా జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు దాడి నిర్వహించగా, డీమానిటైజేషన్ తర్వాత అమోదం కోల్పోయిన పాత రూ.500, రూ.1,000 నోట్లతో నిండిన పలు సంచులు అక్కడ నుంచి బయటపడ్డాయి.

నగదుతో ఉన్న ఈ సంచులను స్వాధీనం చేసుకున్న సమయంలో అక్కడ ఉన్న పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ రద్దయిన కరెన్సీ రవాణాకు ఉపయోగించిన రెండు వాహనాలను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనలో భారీ మొత్తంలో రద్దయిన నోటలు ఉన్నట్లు తెలుస్తుండగా, వాటి మూలం ఏమిటనే దానిపై విచారణ కొనసాగుతోంది.

“స్వాధీనం చేసిన నగదు ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న నెట్‌వర్క్ ఏమిటన్న అంశాలపై అదుపులో ఉన్నవారిని ప్రశ్నిస్తున్నాము,” అని ఒక అధికారి తెలిపారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Related posts

బ్రేకింగ్ న్యూస్: లడ్డు కల్తీ వ్యవహారంలో కీలకపరిణామం

Satyam News

దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ అవార్డు

Satyam News

కేంద్ర మంత్రి పెమ్మసానికి ఢిల్లీలో కీలక బాధ్యతలు

Satyam News

వారంలో పాస్ బుక్‌లు..రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్

Satyam News

రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు

Satyam News

ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లను నాటాలి

Satyam News

Leave a Comment