25.2 C
Hyderabad
September 20, 2026
ఆధ్యాత్మికంహోమ్

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

గత 41 రోజులు దీక్ష కాలం పూర్తి చేసుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి బి.యస్.కేశవ్ గురుస్వామి,శిష్య బృందం తిరుమల తిరుపతి యాత్రకు బయలుదేరారు.

గురుస్వాముల ఆధ్వర్వంలో గోవిందా స్వాములు మాలధారణ దీక్ష గోవిందా స్వాములు ఇరుముడి కార్యక్రమాని ఘనంగా నిర్వహించారు. ముందుగా బి.యస్.కేశవ్ గురుస్వామి,శిష్య బృందం గోవింద స్వాములు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మహా మంగళహారతి తీర్థప్రసాదాలు స్వీకరించి తమ మొక్కులను తీర్చుకున్నారు.

అనంతరం ఇరుముడితో తిరుమల తిరుపతికి యాత్రకు బయలుదేరడం జరిగింది. ఈ సందర్బంగా లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో గద్వాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతోను ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఆయన తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కమ్మరిరాము వడ్డేకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిర్మలమ్మ బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా

Satyam News

ఇరాన్ పై దాడులు ప్రారంభించిన ఇజ్రాయిల్

Satyam News

కుక్కలు కాదు.. పిచ్చి కుక్కలు…. షర్మిల ఎదురుదాడి….!!

Satyam News

తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు

Satyam News

శ్రీకాకుళంలో ఉచిత వైద్య శిబిరం

Satyam News

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జూలకంటి

Satyam News

Leave a Comment