ఆధ్యాత్మికంహోమ్

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

గత 41 రోజులు దీక్ష కాలం పూర్తి చేసుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి బి.యస్.కేశవ్ గురుస్వామి,శిష్య బృందం తిరుమల తిరుపతి యాత్రకు బయలుదేరారు.

గురుస్వాముల ఆధ్వర్వంలో గోవిందా స్వాములు మాలధారణ దీక్ష గోవిందా స్వాములు ఇరుముడి కార్యక్రమాని ఘనంగా నిర్వహించారు. ముందుగా బి.యస్.కేశవ్ గురుస్వామి,శిష్య బృందం గోవింద స్వాములు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మహా మంగళహారతి తీర్థప్రసాదాలు స్వీకరించి తమ మొక్కులను తీర్చుకున్నారు.

అనంతరం ఇరుముడితో తిరుమల తిరుపతికి యాత్రకు బయలుదేరడం జరిగింది. ఈ సందర్బంగా లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో గద్వాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతోను ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఆయన తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కమ్మరిరాము వడ్డేకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రధాని ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

అమ్మవారికి అగ్గిపెట్టెలోపట్టే పట్టుచీర సమర్పణ

Satyam News

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

Satyam News

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ

Satyam News

వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Satyam News

నారా లోకేష్ ప్రత్యేకత…. పాజిటివ్ పాలిటిక్స్!

Satyam News

Leave a Comment