జాతీయంహోమ్

అజిత్ పవార్ విమానం కూలింది ఇలా…

#PlaneCrash

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను తీసుకెళ్లిన విమానం బుధవారం ఉదయం పుణే జిల్లా బారామతి సమీపంలో కూలిపోయే ముందు గాల్లో “కొంచెం అస్థిరంగా” కనిపించిందని ఓ మహిళా ప్రత్యక్షసాక్షి తెలిపారు. భూమిని తాకిన వెంటనే విమానం పేలిపోయిందని ఆమె చెప్పారు. ఈ ఘటనను చూసిన మరో వ్యక్తి మాట్లాడుతూ, విమానం కూలిన వెంటనే మంటల్లో చిక్కుకుందని, ఆ తర్వాత వరుసగా నాలుగు నుంచి ఐదు పేలుళ్లు జరిగినట్లు తెలిపారు.

అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో 66 ఏళ్ల అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. విమానం ఉదయం 8.50 గంటలకు బారామతి సమీపంలో కూలిపోయింది. మహిళా ప్రత్యక్షసాక్షి తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం సమయంలో ఆమె విమానం బారామతి విమానాశ్రయం చుట్టూ తిరుగుతున్నట్లు గమనించారు. “విమానం గాల్లో ఒక చక్కర్లు కొట్టింది. అది కొంచెం అస్థిరంగా కనిపించింది.

రన్‌వేపై ల్యాండ్ కావడానికి దగ్గరపడుతుండగా భూమిని బలంగా ఢీకొట్టి పేలిపోయింది. భారీ శబ్దం వచ్చి మా ఇంటి వరకు వినిపించింది,” అని ఆమె ఓ న్యూస్ ఛానల్‌కు చెప్పారు. పేలుడు తర్వాత విమాన భాగాలు గాల్లోకి ఎగిరిపోయి తన ఇంటి సమీపంలో పడినట్లు ఆమె తెలిపారు.

“విమానం కిందికి పడే ముందు ఒరిగిపోయింది. మేము పేలుడిని చూశాం. అది చాలా భయానకంగా ఉంది,” అని ఆమె అన్నారు. మరో ప్రత్యక్షసాక్షి మాట్లాడుతూ, విమానం దిగుతున్న సమయంలో నియంత్రణ కోల్పోతున్నట్లు కనిపించిందని చెప్పారు. “విమానం దిగుతున్న విధానాన్ని చూసి ఇది కూలిపోతుందనే భావన వచ్చింది. అది రన్‌వేకు సుమారు 100 అడుగుల ఎత్తులో ఉంది.

మేము అక్కడికి పరుగెత్తగా మంటలు కనిపించాయి. వెంటనే నాలుగు నుంచి ఐదు వరుస పేలుళ్లు జరిగాయి. వాటి వల్ల విమానం దగ్గరకు వెళ్లలేకపోయాం,” అని ఆయన మీడియాకు తెలిపారు. “అది భారీ అగ్నిప్రమాదం. తర్వాత అజిత్ పవార్ విమానంలో ఉన్నారని తెలిసింది. అది మాకు షాకింగ్‌గా అనిపించింది,” అని ఆయన చెప్పారు.

ఫ్లైట్ రాడార్ సమాచారం ప్రకారం, విమానం ఉదయం 8.10 గంటలకు ముంబై నుంచి బయలుదేరి, 8.45 గంటల ప్రాంతంలో రాడార్ నుంచి మాయమైంది. ఫిబ్రవరి 5న జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా సమావేశాల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి వెళ్తున్నారు.

ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నారని ఒక పోలీసు అధికారి తెలిపారు. జిల్లా ఎస్పీ సందీప్ గిల్ మాట్లాడుతూ, “విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు,” అని చెప్పారు.

Related posts

రికార్డు స్థాయి వృద్ధిరేటు లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్

Satyam News

29 నుంచి అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి భారత్ కు మరో రెండు నౌకలు

Satyam News

ఎఫ్ఎన్ సిసి – పుల్లెల గోపీచంద్ బ్యాడ్మిండన్ లీగ్

Satyam News

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పై దాడి

Satyam News

దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ అవార్డు

Satyam News

Leave a Comment