ప్రత్యేకంహోమ్

నిరుద్యోలను మోసం చేసిన కాంగ్రెస్

#Kavita

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను, నిరుద్యోగ జెఎసి నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటారనే సాకుతో ఆదివారం రాత్రి నుంచే పోలీసులు నిరుద్యోగులను, తెలంగాణ జాగృతి యువజన విభాగం నాయకులను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె మండిపడ్డారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ మాట నిలబెట్టుకోలేక ఇప్పుడు నిరసన గళాలను నొక్కేయాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు.

ప్రభుత్వం తక్షణమే అరెస్టయిన నిరుద్యోగులందరినీ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. తక్షణమే స్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని కవిత డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆకాంక్షలను విస్మరించి, కేవలం రాజకీయ పర్యటనల కోసం వారిని వేధించడం సరికాదని ఆమె ఈ ప్రకటనలో స్పష్టం చేశారు

.

Related posts

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు పరిశీలించిన మంత్రి

Satyam News

అహోబిలం పారువేట ఉత్సవంకు యూనెస్కో గుర్తింపు

Satyam News

గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం కు మార్గం సుగమం

Satyam News

తెలుగు వారందరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam News

వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చిన మల్లయ్య

Satyam News

అమెరికాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ‘మీట్ అండ్ గ్రీట్’

Satyam News

Leave a Comment