గుంటూరులో జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించే సమయంలో ఓ వైసీపీ కార్యకర్త చేతివాట ప్రదర్శించాడు. దేవుడి గదిలోని ముడుపును సొమ్మును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పోలీసుల సెక్యూరిటీ తనిఖీలో ఈ తతంగం వెలుగు చూసింది.
చేతిలో ముడుపును చూసి అనుమానంతో పోలీసులు చెక్ చేశారు. దాంతో దొంగ దొరికాడు. వైసీపీ కార్యకర్త చేతిలో ఉన్న చిన్నమూటను తీసుకుని పరిశీలించగా ముడుపు డబ్బులుగా నిర్ధారణ అయింది. ఆ వైసీపీ కార్యకర్తను వేమూరు వైసీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు డ్రైవర్ సోదరుడిగా పోలీసులు గుర్తించారు.
