చిత్తూరుహోమ్

శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదంపై సమీక్ష

#PavanKalyan

తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిస్థితిని సమీక్షించారు. తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో, బయోట్రిమ్ వెనుక భాగంలో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు.

అగ్నిమాపక సిబ్బంది మరియు అటవీ శాఖ సమన్వయంతో మంటలను అదుపులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర సమాచారం సేకరించేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రాంతంలో కొనసాగుతున్న అగ్నిమాపక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, అగ్నిప్రమాదానికి కారణమైన వారిపై అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) నుంచి ఘటనపై నివేదిక కోరారు.

శేషాచలం అటవీ ప్రాంతం పర్యావరణపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం కావడంతో, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, మంటలు పూర్తిగా ఆర్పే వరకు చర్యలు కొనసాగించాలని ఆదేశించారు.

Related posts

మోహన్ బాబు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

Satyam News

2025 కేలండర్‌ లో సగం కాలం విమానంలోనే…

Satyam News

కిలో కల్తీ నెయ్యికి రూ.25 కమీషన్..అన్ని వేళ్లు సుబ్బారెడ్డి వైపే!

Satyam News

పౌర్ణమి సందర్భంగా శ్రీశైల గిరిప్రదక్షిణ

Satyam News

గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా అయోధ్య లో 9వ దీపోత్సవం

Satyam News

‘మన ఊరు–మన బడి’ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి

Satyam News

Leave a Comment