26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

బూతులు.. కిడ్నాపులు.. హత్యలు.. జగన్‌ పరామర్శకు ఇవే అర్హతలా..?

#YSJagan

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా పరామర్శ యాత్రలు చేస్తున్నారు. అధికారం పోయిన తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చిన సందర్భాలన్నీ పరామర్శ యాత్రలే. మరి ఆయన ఎవరిని పరామర్శిస్తున్నారు.. ఎందుకు పరామర్శిస్తున్నారో చూస్తే.. సీఎం చంద్రబాబును బూతులు తిట్టిన అంబటి రాంబాబు.. మంత్రి నారా లోకేశ్‌ మీద నోరు పారేసుకున్న జోగి రమేశ్‌, మహిళా ఎమ్మెల్యే గురించి అసభ్యంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి, దళితుడిని కిడ్నాప్‌ చేసిన వల్లభనేని వంశీ, హత్య కేసులో జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వైసీపీ నాయకులు.. తెనాలి గంజాయి బ్యాచ్‌, పొదిలి బెట్టింగ్‌ బ్యాచ్‌లాంటి గలీజ్‌ సన్నాసులు‌.. తప్పులు చేసి చట్టానికి దొరికిపోతే.. వాళ్లేదో స్వతంత్ర పోరాటం చేసి జైలుకు వెళ్లినట్టు జగన్‌రెడ్డి పరామర్శ యాత్రలు చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. జైలుకెళ్లిన వాళ్లను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కేటాయించేది పది నిముషాలు. జగన్‌రెడ్డి చేతులు ఊపుతూ ఊరేగింపుగా తిరిగేది ఐదారు గంటలు. అంటే ఈ పరామర్శ యాత్రల అసలు ఉద్దేశం బల ప్రదర్శన చేయడమే. కష్టాల్లో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఆదుకొని.. వారికి ధైర్యం చెబితే అర్ధం చేసుకోవచ్చు. కానీ గంజాయి స్మగ్లర్లు, బూతు బ్యాచ్‌, కిడ్నాపర్లు, హంతకులను మాత్రమే పరామర్శించడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో.. వైసీపీ నాయకులే వివరించాలి. జగన్‌రెడ్డి ఏం చేసినా గుడ్డి ఫాలో అవడమే తప్ప.. ఇదేంటని ప్రశ్నించే వాళ్లు వైసీపీలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. ప్రజాస్వామ్యం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు గానీ.. సొంత పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం కూడా లేకుండా చేసిన ఘన చరిత్ర వైసీపీ సొంతం.

నీ స్నేహితులను చూసి నువ్వు ఎలాంటివో వాడివో చెప్పొచ్చు అంటారు మానసికవేత్తలు. సామాన్యులకే కాదు.. రాజకీయ నాయకులకూ ఈ సూత్రం వర్తిస్తుంది. రౌడీ షీటర్లు, స్మగ్లర్లు, కిడ్నాపర్లు, హంతకులను ఆత్మియులుగా భావించే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఏమనాలో.. ఆయన ఎలాంటి వాడో ప్రజలే అర్ధం చేసుకోవాలి. నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్లు ఎలాంటి విషయాలను ప్రోత్సహిస్తే.. వాళ్ల మార్గదర్శకత్వంలో పని చేసే వాళ్లు అదే ఫాలో అవుతారు. బూతు నేతలను, గూండా నాయకులను ప్రోత్సహించే నాయకత్వంలో.. రాష్ట్ర ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. నేరస్తుల పట్ల సానుభూతి చూపించి.. బాధితులకు శిక్ష వేయాలనే రివర్స్‌ నేతల చేతికి అధికారం అందితే.. సామాన్యులు ఏమైపోతారో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి అహంకారాన్ని సంతృప్తి పరచడానికి, అధికార దాహం తీర్చడానికి.. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భద్రతను పణంగా పెట్టాలా.. ఈ ప్రశ్నలకు ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి.

Related posts

మహిళల కోసం పథకాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

Satyam News

New Record: దేవాదాయ శాఖలో 191 మందికి నియామక ఉత్తర్వులు

Satyam News

ఎంఎల్ పార్టీల సాయుధ పోరాట విరమణ

Satyam News

వైఎస్ గుట్టు బయటపెట్టిన వైసీపీ ప్రధాన కార్యదర్శి

Satyam News

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

Satyam News

కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లే

Satyam News

Leave a Comment