కడపహోమ్

వాకర్స్ అసోసియేషన్ మెగా వైద్య శిబిరం

కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలో ఆదివారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కే. శరత్ కుమార్ రాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని రోగులకు రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, కంటి మరియు ఇతర సాధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కే. శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ, వాకర్స్ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం చేపడుతోందని తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Related posts

కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు

Satyam News

అసెంబ్లీకి వెళ్లకపోతే సీన్ రివర్స్…. వైసీపీ ఎమ్మెల్యేల్లో భయం…!!

Satyam News

దుబాయ్ ఎయిర్ షో లో ప్రమాదం

Satyam News

ఏపిలో ఐఏఎస్ లకు పోస్టింగ్ లు

Satyam News

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Satyam News

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ మీటింగ్

Satyam News

Leave a Comment