25.2 C
Hyderabad
September 20, 2026
కడపహోమ్

వాకర్స్ అసోసియేషన్ మెగా వైద్య శిబిరం

కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలో ఆదివారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కే. శరత్ కుమార్ రాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని రోగులకు రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, కంటి మరియు ఇతర సాధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కే. శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ, వాకర్స్ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం చేపడుతోందని తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Related posts

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News

ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగంపై సదస్సు

Satyam News

విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వ‌త ఆస్తుల క‌ల్ప‌న‌

Satyam News

కుటుంబ వివాదాలతో జగన్‌ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్….!!

Satyam News

సునీతకు తీరని అన్యాయం చేసిన జగన్

Satyam News

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News

Leave a Comment