కడపహోమ్

వాకర్స్ అసోసియేషన్ మెగా వైద్య శిబిరం

కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలో ఆదివారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కే. శరత్ కుమార్ రాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని రోగులకు రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, కంటి మరియు ఇతర సాధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కే. శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ, వాకర్స్ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం చేపడుతోందని తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Related posts

సూర్యలంక తీరం లో మరో రెండు రోజుల పాటు నిషేధం

Satyam News

పేదల తిరుపతి ఆలయ పునర్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

Satyam News

హజ్ యాత్ర సౌకర్యాలపై సమీక్ష

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి భారత్ కు మరో రెండు నౌకలు

Satyam News

ఆ ఒక్క నిర్ణయం క్రికెట్ గతిని మార్చింది…

Satyam News

కాకినాడ ప్రాంతంలో ముమ్మరంగా సహాయక చర్యలు

Satyam News

Leave a Comment