గుంటూరుహోమ్

మాట నిలబెట్టుకున్న లోకేష్…. పేద ముస్లిం ఫ్యామిలీకి రంజాన్‌ కానుక…!!

#NaraLokesh

ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. గతేడాది రంజాన్ మాసంలో ఓ పేద ముస్లిం మైనార్టీ సోదరుడికి ఇచ్చిన మాటను, ఏడాది తిరగకముందే నెరవేర్చి గొప్ప మనసు చాటుకున్నారు. నేను ఉన్నాను..నేను చూసుకుంటాను అంటూ నాడు లోకేష్ ఇచ్చిన హామీ, ఇవాళ ఒక అందమైన ఇల్లుగా మారి ఆ పేద కుటుంబంలో వెలుగులు నింపింది.

గతేడాది రంజాన్ సమయంలో ఒక పేద ముస్లిం మైనార్టీ సోదరుడి నివాసానికి వెళ్ళిన లోకేష్, అక్కడ వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను, వారి నివాస పరిస్థితిని చూసి లోకేష్‌ చలించారు. ఆ కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటానని, వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

సాధారణంగా రాజకీయాల్లో హామీలు ఇచ్చి మరిచిపోవడం చూస్తుంటాం. కానీ లోకేష్ మాత్రం నిరంతరం ఆ ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ, ఏడాది తిరగకముందే ఆ పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేశారు. సకల సౌకర్యాలతో నిర్మించిన ఆ ఇంటిని చూసి ఆ ముస్లిం కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ పండుగ వేళ తమకు ఇంతటి గొప్ప బహుమతిని అందించిన మంత్రి లోకేష్‌కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మాట ఇస్తే వెనక్కి తగ్గని నైజం లోకేష్‌ది అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, కష్టాల్లో ఉన్న సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ముస్లిం మైనార్టీల పట్ల లోకేష్‌కు ఉన్న గౌరవం, ఆత్మీయతకు ఈ ఇల్లు ఒక నిదర్శనంగా నిలిచింది.

Related posts

కాకినాడ జిల్లాలో పెట్రేగిన మట్టి మాఫియా

Satyam News

ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ కు పీఎం మోడీ

Satyam News

భక్తుల కోలాహలం మధ్య చార్ ధాం యాత్ర ప్రారంభం

Satyam News

ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండండి

Satyam News

‘అమరావతి’ అంటూ జమ్మలమడుగు జన గర్జన!

Satyam News

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News

Leave a Comment