25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

మాట నిలబెట్టుకున్న లోకేష్…. పేద ముస్లిం ఫ్యామిలీకి రంజాన్‌ కానుక…!!

#NaraLokesh

ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. గతేడాది రంజాన్ మాసంలో ఓ పేద ముస్లిం మైనార్టీ సోదరుడికి ఇచ్చిన మాటను, ఏడాది తిరగకముందే నెరవేర్చి గొప్ప మనసు చాటుకున్నారు. నేను ఉన్నాను..నేను చూసుకుంటాను అంటూ నాడు లోకేష్ ఇచ్చిన హామీ, ఇవాళ ఒక అందమైన ఇల్లుగా మారి ఆ పేద కుటుంబంలో వెలుగులు నింపింది.

గతేడాది రంజాన్ సమయంలో ఒక పేద ముస్లిం మైనార్టీ సోదరుడి నివాసానికి వెళ్ళిన లోకేష్, అక్కడ వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను, వారి నివాస పరిస్థితిని చూసి లోకేష్‌ చలించారు. ఆ కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటానని, వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

సాధారణంగా రాజకీయాల్లో హామీలు ఇచ్చి మరిచిపోవడం చూస్తుంటాం. కానీ లోకేష్ మాత్రం నిరంతరం ఆ ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ, ఏడాది తిరగకముందే ఆ పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేశారు. సకల సౌకర్యాలతో నిర్మించిన ఆ ఇంటిని చూసి ఆ ముస్లిం కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ పండుగ వేళ తమకు ఇంతటి గొప్ప బహుమతిని అందించిన మంత్రి లోకేష్‌కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మాట ఇస్తే వెనక్కి తగ్గని నైజం లోకేష్‌ది అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, కష్టాల్లో ఉన్న సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ముస్లిం మైనార్టీల పట్ల లోకేష్‌కు ఉన్న గౌరవం, ఆత్మీయతకు ఈ ఇల్లు ఒక నిదర్శనంగా నిలిచింది.

Related posts

పేదల కల సాకారం.. రేపే ఏపీలో మహా గృహ సంబరం!

Satyam News

నమ్మిన భక్తుల కల్పతరువు శ్రీ తిమ్మప్ప స్వామి

Satyam News

క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం బసవతారకం ఆస్పత్రి

Satyam News

అహోబిలం పారువేట ఉత్సవంకు యూనెస్కో గుర్తింపు

Satyam News

కేరళలోని అమృతపురి ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

Satyam News

ఆదిలో భారమైనా ఆ తర్వాత అంతా లాభమే

Satyam News

Leave a Comment