అల్లూరి జిల్లా అరకులోయ మండల కేంద్రంలోని తాశీల్దార్ కార్యాలయం ఆవరణములో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రణ బేరి 3.0 అరకు నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నిరాహార దీక్ష నిర్వహించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీలిచ్చిన అమలు జరగలేదని డిమాండ్ చేశారు.
పిఆర్సి కమిషన్ నియమించాలని ఐ ఆర్ ప్రకటించాలి. పాత డీఏ బకాయిలు చెల్లించాలని. ఆర్థిక బకాయిలు అన్నిటిని వెంటనే చెల్లించాలి. ఓ పి ఎస్ విధానాన్ని అమలు పరచాలి. కేజీబీవీ ఏంటి ఎస్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అరకు మండల తాశిల్దార్ కార్యాలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యు టి ఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి చిట్టి బాబు జిల్లా అధ్యక్షుడు. కె రాంబాబు మండల అధ్యక్షులు. తదితరులు పాల్గొన్నారు.
