రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మేడ్చల్ జిల్లా సైనిక్ పురి – యాప్రాల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ఫైర్ ర్యాలీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్కృతి, క్రీడలకు, నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని మంత్రి సందర్భంగా పిలుపునిచ్చారు. క్రీడా ప్రాంగణాలను, పార్కులను వినియోగించుకోవాలని కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ కొద్దిసేపు బ్యాడ్మింటన్ ను ఆడారు.
