26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

#Tirumala

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏప్రిల్ 10, 24వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

12వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.

ఏప్రిల్ 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు శ్రీ భాష్య‌కార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

20న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

21 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ మధురకవి ఆళ్వార్, శ్రీ అనంతాల్వార్ ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

23న శ్రీ భాష్య‌కార్లవారి గంథ‌పుపొడి ఉత్స‌వం, శ్రీ ముదలియాండాన్ స్వామి వారి (దాశరథి) తిరునక్షత్రం.

ఏప్రిల్ 28 నుండి 30వ‌ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం.

Related posts

గిరిజన విద్యార్ధులకు అండగా మంత్రి నారా లోకేష్

Satyam News

సాక్షిలో కథనం మాడభూషిది కాదా.. ఆ ఆర్టికల్‌ రాసింది ఎవరు..?

Satyam News

చంద్రబాబు ప్రతిపాదనపై అమిత్ షా స్పందన ఏమిటి?

Satyam News

ఆవుల‌ను త‌ర‌లిస్తే ఖ‌బ‌డ్దార్‌: అర్ద‌రాత్రి ఎస్పీ త‌నిఖీలు

Satyam News

నరసాపురం లేసుల స్పెషాలిటీ: 25 ఏళ్ల క్రితమే చంద్రబాబు బ్రాండింగ్‌

Satyam News

భారతీయులకు బ్రిటన్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు

Satyam News

Leave a Comment