మెదక్హోమ్

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సుప్రీంకోర్టుకు….?

#HarishRao

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు.

ఏప్రిల్ 22వ తేదీన తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై వెలువడనున్న తుది తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను సిద్ధం చేసేందుకు వీరు ఢిల్లీ వెళ్లారు.

ఇందులో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో   చర్చించనున్నారు.

Related posts

పొగాకు రైతులకు డబుల్ ధమాకా…. కూటమి ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌

Satyam News

అన్నా క్యాంటీన్ లో చంద్రబాబు దంపతుల అల్పాహారం

Satyam News

దూసుకువస్తున్న సేన్యార్ తుఫాన్

Satyam News

ఫ్రెండ్షిప్ డే వేళ విశాఖలో విషాదం: బీచ్‌లో ఇద్దరు గల్లంతు

Satyam News

వైద్య సామాగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం

Satyam News

ఆటోగ్యాస్ కొరతను అధిగమించడానికి ప్రజా రవాణా సేవల విస్తరణ

Satyam News

Leave a Comment