ప్రత్యేకంహోమ్

బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి

#SuvenduAdhikari (2)

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి శుక్రవారం బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

కోల్‌కతాలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో సువేందు అధికారి పేరును ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పరిణామంగా భావిస్తున్నారు.

కొత్త బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 9న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సువేందు అధికారి ఎన్నికతో రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌కు ఇది పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

జిందాల్ ఎంఎస్ఎమ్ఈ పార్క్ వర్చువల్ ప్రారంభోత్సవానికి సిద్ధం

Satyam News

ఇంటర్ లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం.. .

Satyam News

రామ్ మోహన్ నాయుడిపై జాతీయ స్థాయిలో వైసీపీ కుట్ర..???

Satyam News

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన

Satyam News

అనంతబాబుకు సహకరించిన సీఐ సస్పెన్షన్

Satyam News

కవిత పార్టీపై కేటీఆర్ తొలి స్పందన…

Satyam News

Leave a Comment