ఢిల్లీలో మరొక ఘోరం జరిగింది. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఓ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మే 12న జరిగినట్లు సమాచారం.
ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64(1) అత్యాచారం, సెక్షన్ 70(1) గ్యాంగ్ రేప్, సెక్షన్ 3(5) కామన్ ఇంటెన్షన్ కింద కేసు నమోదు చేశారు. ఘటనలో ఉపయోగించిన స్లీపర్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
