25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

ఆన్‌లైన్‌లో మహానాడు: చంద్రబాబు సంచలన నిర్ణయం

#Chandra

అడంబరాలకు స్వస్తి పలికి… పొదుపు మంత్రం పాటించడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మహానాడు’ వేడుకలను ఈసారి డిజిటల్ వేదికపై నిర్వహించాలని నిశ్చయించారు.

సాధారణంగా మహానాడు అంటే లక్షలాది మంది కార్యకర్తలతో, కోట్లాది రూపాయల ఖర్చుతో అట్టహాసంగా జరిగే వేడుక. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ వనరులను వృధా చేయకూడదనే ఉద్దేశంతో ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

ఎన్టీఆర్ భవన్‌లోనే స్టేజీని ఏర్పాటు చేసి, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆన్‌లైన్ ద్వారా కార్యకర్తలను అనుసంధానం చేయబోతున్నారు. ఇది కేవలం ఖర్చు తగ్గించుకోవడం మాత్రమే కాదు… మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం అటు పార్టీ వర్గాల్లో, ఇటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. చెప్పడమే కాదు… చేసి చూపించడమే అసలైన నాయకత్వం అని ఈ ‘డిజిటల్ మహానాడు’ మరోసారి నిరూపిస్తోంది!

Related posts

వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Satyam News

50 ఏళ్ల తర్వాత కలిసిన “లక్ష్మణరేఖ” జంట

Satyam News

తెలంగాణ గిరిజన గురుకులాలు దేశానికే ఆదర్శం

Satyam News

మెడికల్ కాలేజీలకు కులం రంగు పులుముతున్న జగన్

Satyam News

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

Satyam News

మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ

Satyam News

Leave a Comment