రంగారెడ్డిహోమ్

అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం

#DrAmbedkarOpenUniversity

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ  డిగ్రీ, పీ.జీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ – ఎం.ఏ – ( తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అర్థశాస్త్రం, చరిత్ర, ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజ శాస్త్రం, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్); ఎం.కాం, ఎం.ఎస్సీ – (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, గణితశాస్త్రం, అనువర్తిత గణితశాస్త్రం కోర్సులు),  ఎం.ఎల్ఐఎస్సి,  డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్ లు జరుగుతున్నాయి.

భారత దేశ పౌరులు ఎవరు అయినా పై కోర్సుల్లో వారికి ఉన్న కనీస అర్హత ప్రకారం అడ్మిషన్ పొందోచ్చని అయితే సదరు అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధ్యయన కేంద్రాన్ని మాత్రమే ఎంచుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.in; లేదా www.braou.ac.in లో పొందొచ్చని అధికారులు వెల్లడించారు.

డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందడానికి  ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత, లేదా పదో తరగతి తర్వాత ఏదేనీ రెండు సంవత్సరాల కోర్సు, డిప్లొమా, ఐటిఐ, పాలిటెక్నిక్, ఓపెన్ స్కూల్ లో ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా అర్హులేనని వెల్లడించారు.

ఇప్పటికే ఆయా కోర్సుల్లో చేరి ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును ఆగష్టు 7వ తేదీ లోపు ఆన్ లైన్ లో చెల్లించాలని తెలిపారు.

పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570, 040-23680222 / 333 / 555 ఫోన్ నెంబర్ లలో  టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో సంప్రదించొచ్చని  సూచించారు.

డిగ్రీ 2021-22 నుండి 2025-26 రెండో, మూడో సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు అదేవిధంగా పీజీ 2023-24 నుండి 2025-26 బ్యాచ్ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా అడ్మిషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా TS ఆన్ లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చు అని వివరించారు.

ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది ఆగష్టు 7, 2026.

Related posts

ఎలక్ట్రీషియన్ ఘాతుకం: భార్యను చంపి…

Satyam News

క్వాంటం కంప్యూటింగ్ లో కీలక ఘట్టం ఆవిష్కరించిన అమరావతి

Satyam News

ఆ కంపెనీని తరిమేస్తా….. నెల్లూరులో జగన్‌ రప్పా రప్పా..!!

Satyam News

భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు

Satyam News

భారీ శ‌బ్దాల‌తో సైలెన్సర్‌ లు వాడితే చర్యలు

Satyam News

ఇస్తాంబుల్ లో ఇజ్రాయెల్ కాన్సులేట్ పై దాడి

Satyam News

Leave a Comment