25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

మాచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

మాచర్ల శివారు నగర వనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి కనిగిరి సమీపంలోని వెనిగండ్ల మండలం నాగిరెడ్డి పల్లె గ్రామానికి వెళుతుండగా తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

వీరంతా వారి మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు హాజరవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వాహనంలో డ్రైవర్ తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు. ఇద్దరు మహిళలు ఇద్దరు మగవారు మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు గాయ పడ్డారు. వారి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలించారు. మృతి చెందిన వారి వివరాలు: కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు శారద.

మాచర్ల పట్టణం నుండి మండాది రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రమాద స్థలంలో మృతి చెందారు మిగిలిన వారిని108 వాహనం ద్వారా మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.

Related posts

కేసీఆర్‌ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగం

Satyam News

షరతులు పాటిస్తేనే ఇక అమెరికాతో చర్చలు

Satyam News

ఏపీలో PPP వైద్య కళాశాలలు: కష్టాలకు పరిష్కారమా?

Satyam News

ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో….. వైసీపీని పేల్చేసిన.. మావిగన్‌..!!

Satyam News

ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌…

Satyam News

రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలి

Satyam News

Leave a Comment