ముఖ్యంశాలుహోమ్

మాచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

మాచర్ల శివారు నగర వనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి కనిగిరి సమీపంలోని వెనిగండ్ల మండలం నాగిరెడ్డి పల్లె గ్రామానికి వెళుతుండగా తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

వీరంతా వారి మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు హాజరవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వాహనంలో డ్రైవర్ తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు. ఇద్దరు మహిళలు ఇద్దరు మగవారు మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు గాయ పడ్డారు. వారి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలించారు. మృతి చెందిన వారి వివరాలు: కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు శారద.

మాచర్ల పట్టణం నుండి మండాది రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రమాద స్థలంలో మృతి చెందారు మిగిలిన వారిని108 వాహనం ద్వారా మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.

Related posts

వైద్య హబ్‌గా తెలంగాణ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Satyam News

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

Satyam News

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క

Satyam News

రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలి

Satyam News

వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌-2026 లో దిగజారిన భారత్‌

Satyam News

ఇరాన్ పై బీ 2 స్టిల్త్ బాంబర్ల ప్రయోగం

Satyam News

Leave a Comment