వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు బిగ్షాక్ తగిలింది. విజయవాడ పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో జరిగిన ఓ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో, బాధితురాలైన మైనర్ బాలిక వివరాలను, ఆమె గుర్తింపును బహిర్గతం చేశారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. చట్టప్రకారం మైనర్ బాధితుల వివరాలను వెల్లడించడం తీవ్రమైన నేరం కావడంతో ఈ విషయాన్ని కోర్టు సీరియస్గా తీసుకుంది.
మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గోరంట్ల మాధవ్పై కేసు నమోదు చేశారు. బాధితురాలి గోప్యతను కాపాడాల్సింది పోయి, ఆమె వివరాలను బయటపెట్టడం ద్వారా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
విజయవాడ పోక్సో న్యాయస్థానంలో శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. దీనికి గోరంట్ల మాధవ్ గైర్హాజరయ్యారు. దీంతో అతనిపై నాన్బెయిలబుల్ వారంట్ జారీ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
నాన్బెయిలబుల్ వారంట్ జారీ చేయడంతో ఏ క్షణమైనా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.
గోరంట్ల మాధవ్ మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. ఎంపీగా ఉన్న సమయంలో మహిళతో జరిపిన న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
