26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్

#Talasani

మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లీం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రార్ధనలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది ముస్లీం సోదర సోదరీమణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో ప్రార్ధనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు.

ఎమ్మెల్యే వెంట సనత్ నగర్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, రాజేష్ ముదిరాజ్, బాలరాజ్, ఫాజిల్, ఖలీల్, జమీర్, గోపిలాల్ చౌహన్, వనం శ్రీనివాస్, సమి ఉల్లా తదితరులు ఉన్నారు.

Related posts

ఐస్ క్రీమ్ లో వీర్యం కలిపిన ఘనుడు

Satyam News

ఢిల్లీ లిక్కర్ కేసులో తీర్పు చెప్పిన జడ్జి సామాన్యుడు కాదు…

Satyam News

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

Satyam News

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని విమర్శించే స్థాయి మీకు లేదు

Satyam News

మా తీరంలో ఇరాన్ నౌకను కాపాడుతున్నాం

Satyam News

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో…

Satyam News

Leave a Comment