ఆధ్యాత్మికంహోమ్

నందిగామలో జంట నాగేంద్రుల దివ్య విగ్రహం

#NagendraSwamy

నందిగామలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో జంట నాగేంద్రుల దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. కాకుళయ్యగారి బజార్‌లోని పాత పోస్టాఫీస్ రోడ్ వద్ద ఉన్న దేవస్థానంలో పురోహితులు, ఉపాసకులు బ్రహ్మశ్రీ ధండిబోట్ల కృష్ణమూర్తి (నాని గారు) ఆధ్వర్యంలో ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దివ్య విగ్రహాన్ని మహంకాళి రంగా, లక్ష్మీ ప్రసన్న దంపతులు బహూకరించి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణగా సుమారు వెయ్యి మందికి పైగా భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని గోపు సుబ్రమణ్యం, పబ్బతి నరేంద్ర, గోపు సుబ్రమణ్యం (ఎలక్ట్రిషన్), ఉడతా హనుమంతరావు, మెురిశెట్టి కృష్ణ చైతన్య, కొప్పు నరేంద్ర (భాస్కర్ ఎలక్ట్రికల్స్), తులసి రామకృష్ణ తదితరులు సమన్వయం చేశారు.

Related posts

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

Satyam News

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌

Satyam News

ఇంకొద్ది సేపటిలో 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

Satyam News

ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరించిన ట్రంప్

Satyam News

పిహెచ్ సి లలో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొఫైల్

Satyam News

రాయలసీమ లిఫ్ట్‌…. వైసీపీ వాదనలో అసలు నిజం ఇదే….!!

Satyam News

Leave a Comment