ఆధ్యాత్మికం హోమ్

నందిగామలో జంట నాగేంద్రుల దివ్య విగ్రహం

#NagendraSwamy

నందిగామలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో జంట నాగేంద్రుల దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. కాకుళయ్యగారి బజార్‌లోని పాత పోస్టాఫీస్ రోడ్ వద్ద ఉన్న దేవస్థానంలో పురోహితులు, ఉపాసకులు బ్రహ్మశ్రీ ధండిబోట్ల కృష్ణమూర్తి (నాని గారు) ఆధ్వర్యంలో ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దివ్య విగ్రహాన్ని మహంకాళి రంగా, లక్ష్మీ ప్రసన్న దంపతులు బహూకరించి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణగా సుమారు వెయ్యి మందికి పైగా భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని గోపు సుబ్రమణ్యం, పబ్బతి నరేంద్ర, గోపు సుబ్రమణ్యం (ఎలక్ట్రిషన్), ఉడతా హనుమంతరావు, మెురిశెట్టి కృష్ణ చైతన్య, కొప్పు నరేంద్ర (భాస్కర్ ఎలక్ట్రికల్స్), తులసి రామకృష్ణ తదితరులు సమన్వయం చేశారు.

Related posts

దీపావళి సోమవారమా? మంగళవారమా?

Satyam News

ఎర్ర చందనం స్మగ్లర్ల వేట

Satyam News

తాతయ్య గుంట గంగ‌మ్మ ఆల‌య పాల‌క‌మండ‌లి ప్ర‌మాణస్వీకారం

Satyam News

Leave a Comment

error: Content is protected !!