ఆధ్యాత్మికంహోమ్

నందిగామలో జంట నాగేంద్రుల దివ్య విగ్రహం

#NagendraSwamy

నందిగామలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో జంట నాగేంద్రుల దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. కాకుళయ్యగారి బజార్‌లోని పాత పోస్టాఫీస్ రోడ్ వద్ద ఉన్న దేవస్థానంలో పురోహితులు, ఉపాసకులు బ్రహ్మశ్రీ ధండిబోట్ల కృష్ణమూర్తి (నాని గారు) ఆధ్వర్యంలో ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దివ్య విగ్రహాన్ని మహంకాళి రంగా, లక్ష్మీ ప్రసన్న దంపతులు బహూకరించి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణగా సుమారు వెయ్యి మందికి పైగా భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని గోపు సుబ్రమణ్యం, పబ్బతి నరేంద్ర, గోపు సుబ్రమణ్యం (ఎలక్ట్రిషన్), ఉడతా హనుమంతరావు, మెురిశెట్టి కృష్ణ చైతన్య, కొప్పు నరేంద్ర (భాస్కర్ ఎలక్ట్రికల్స్), తులసి రామకృష్ణ తదితరులు సమన్వయం చేశారు.

Related posts

సినీ దర్శకుడు పి సి ఆదిత్య కు దాదా ఫాల్కే గౌరవ పురస్కారం

Satyam News

శ్రీరంగాపూర్ ఎస్సై బాధ్యత చేపట్టిన హిమబిందు

Satyam News

అణు పరీక్షలకు సిద్ధమైన పాకిస్తాన్?

Satyam News

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావనతో వైసీపీ లో అలజడి

Satyam News

పొగాకు రైతులకు డబుల్ ధమాకా…. కూటమి ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌

Satyam News

అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు

Satyam News

Leave a Comment